TEHELKA DAILY
Newspaper Banner
Date of Publish : 26 April 2026, 5:48 pm Posted by : TEHELKA NEWS

సమాచార శాఖ ప్రత్యేక కమిషనర్ గా ముకుంద రెడ్డి.

సమాచార పౌర సంబంధాల శాఖ ప్రత్యేక కమిషనర్ గా జీ. ముకుంద రెడ్డి నేడు బాధ్యతలను స్వీకరించారు. ప్రస్తుత స్పెషల్ కమిషనర్ గా ఉన్న సిహెచ్ ప్రియాంకను బదిలీ చేయడంతో జిహెచ్ఎంసి జోనల్ కమిషనర్ గా ఉన్న ముకుంద రెడ్డిని సమాచార శాఖ ప్రత్యేక కమిషనర్ గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. నేడు సమాచార పౌర సంబంధాల శాఖ ప్రత్యేక కమిషనర్ తో పాటు ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శిగా కూడా ముకుంద రెడ్డి బాధ్యతలను స్వీకరించారు.