రాష్ట్ర ప్రభుత్వ పంచాయితీ రాజ్, గ్రామీణాభివృద్ధి, ఆర్.డబ్ల్యు.ఎస్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఎం. దాన కిషోర్ నేడు భాద్యతలను స్వీకరించారు. గవర్నర్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా కూడా అదనపు భాద్యతలలో దాన కిషోర్ కొనసాగుతున్నారు. అదేవిధంగా, కార్మిక, ఉపాధి, శిక్షణా శాఖ కార్యదర్శిగా దాసరి హరిచందన నేడు సచివాలయంలో భాద్యతలను స్వీకరించారు. విపత్తుల శాఖ కార్యదర్శిగా కూడా హరిచందన అదనపు భాద్యతలను స్వీకరించారు

