
కిసాన్ న్యాయ సత్యాగ్రహ దీక్ష విరమించే కార్యక్రమంలో గ్రేటర్ వరంగల్ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రాజనాల శ్రీహరి మాట్లాడుతూ
ఏఐసీసీ ఆదేశాల మేరకు యువజన కాంగ్రెస్ పిలుపుమేరకు వరంగల్ జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు కొరివి పరమేష్ ఆధ్వర్యంలో గత పది రోజుల నుండి పోచమ్మ మైదాన్ సెంటర్లో రైతులకు కేంద్రం అన్యాయం చేస్తుందంటూ చేపట్టిన దీక్ష విరమణ కార్యక్రమకి గ్రేటర్ వరంగల్ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రాజనాల శ్రీహరి కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ కేంద్ర మోడీ ప్రభుత్వం ఇక్కడ రైతులను మోసం చేస్తూ విదేశాలలో చీకటి ఒప్పందాలు చేసుకుంటూ తక్షణమే చీకటి ఒప్పందాలు వెంటనే విరమించుకోవాలని లేనిపక్షంలో దేశవ్యాప్తంగా యువజన కాంగ్రెస్ ఆదరణలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని రాజనాల శ్రీహరి అన్నారు ఈ కార్యక్రమంలో వరంగల్ యువజన జిల్లా అధ్యక్షులు కొరవి రమేష్ హనుమకొండ జిల్లా అధ్యక్షులు దిలీప్ A.P. Y. C.G. S సప్న. ఏలియా గౌడ్ తో పాటు నాయకులు వందమంది కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు….

