తెలంగాణ వెనుకబడిన తరగతుల కమిషన్
ఈరోజు రాష్ట్ర బీసీ కమిషన్ కార్యాలయంలో బిఆర్ అంబేద్కర్ గారి 135 వ జయంతి సందర్భంగా చైర్మన్ జి నిరంజన్ సభ్యులు రాపోలు జయప్రకాష్ రంగు బాలు లక్ష్మి, అసిస్టెంట్ సెక్రటరీ మనోహర్, డిప్యూటీ డైరెక్టర్ శ్రీనివాస్ రావు మరియు కార్యాలయ సిబ్బంది అంబేద్కర్ చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించడం జరిగింది.
ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ భారత రాజ్యాంగ రచనలో అంబేద్కర్ గారి పాత్ర మరువలేనిదని అలాగే అణగారిన వర్గాలు రిజర్వేషన్లు కల్పించిన వ్యక్తి అని అన్నారు.అలాగే రాజ్యాంగ రచనల సందర్భంలో ఎలాగైతే ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్ కల్పించారో అలాగే బీసీలకు రిజర్వేషన్లు పొందుపరిచే అంశాన్ని నేడు పరిశీలించాల్సిన అవసరం ఉందని అని అన్నారు.చట్టసభలో మహిళ 33% రిజర్వేషన్లు అమలు చేసే సందర్భంలో బీసీ మహిళ లకు కూడా రిజర్వేషన్ కల్పించాలని కోరారు.

