“వరద విపత్తు – మోక్ డ్రిల్” (Flood Mock Drill) కార్యక్రమంలో పాల్గొన్న మునిసిపల్ చైర్ పర్సన్ ఇప్ప ఉమారాణి శ్రీనివాస్….

కామారెడ్డి జిల్లా- తేహెల్కా న్యూస్ : ప్రకృతి వైపరీత్యాలు అనేవి ఎప్పుడు, ఎలా వస్తాయో మనం ఊహించలేము. ముఖ్యంగా వర్షాకాలంలో వచ్చే వరదలు ఊళ్లకు ఊళ్లనే ముంచెత్తుతాయి. అలాంటి అత్యవసర సమయాల్లో మనం భయపడిపోకుండా, ప్రాణనష్టం జరగకుండా మనల్ని మనం ఎలా కాపాడుకోవాలో నేర్పించడానికే ఈ ‘మోక్ డ్రిల్’ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.
“సన్నద్ధతే మనకు రక్ష” వరదలు వచ్చినప్పుడు మనం పాటించాల్సిన కొన్ని ముఖ్యమైన విషయాలను ఈ మోక్ డ్రిల్ ద్వారా మనం ప్రాక్టికల్గా నేర్చుకున్నాం.

వాటిలో ముఖ్యమైనవి:
కంగారు పడకపోవడం: వరద నీరు వస్తున్నప్పుడు మొదటగా మనం పానిక్ (కంగారు) అవ్వకూడదు. ప్రశాంతంగా ఆలోచించి సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలి.
ఎత్తైన ప్రాంతాలకు చేరడం: వరద నీరు ఊట్లోకి లేదా ఇంట్లోకి వస్తున్నప్పుడు, వెంటనే ఇళ్లపైకి లేదా ఎత్తైన సురక్షిత ప్రాంతాలకు చేరుకోవాలి.
ముఖ్యమైన వస్తువుల రక్షణ: మనకు అవసరమైన మందులు, అవసరమైన పత్రాలు (Documents), కొంత డబ్బు, మరియు టార్చ్ లైట్లను ఒక బ్యాగ్లో పెట్టుకుని సిద్ధంగా ఉంచుకోవాలి.
సహాయక చర్యలు: వరదల్లో చిక్కుకున్న వృద్ధులను, చిన్న పిల్లలను మరియు గర్భిణీ స్త్రీలను మొదటగా సురక్షిత ప్రాంతాలకు తరలించడంలో యువత ముందుండాలి.
అధికారిక సమాచారం: పుకార్లను నమ్మకుండా, రేడియో లేదా టీవీల ద్వారా ప్రభుత్వ అధికారులు ఇచ్చే హెచ్చరికలను మాత్రమే పాటించాలి.ఇట్టి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఆశిష్ సంఘ్వాన్, ఇంచార్జ్ అదనపు కలెక్టర్ గీరి, కమిషనర్ పర్వతాలు,MRO బిందు, వైస్ చైర్ పర్సన్ కాసార్ల గోదావరి స్వామి, కౌన్సిలర్ శ్రీధర్ రెడ్డి, DSP మధుసూదన్,CI నరహరి, మున్సిపల్ సిబ్బంది, DE సంతోష్ పబ్లిక్ హెల్త్ &సిబ్బంది, వివిధ రక్షణ బాలగలా సిబ్బంది, అధికారులు ప్రజలు తదితరులు పాల్గొన్నారు…


