
మంత్రాలయం తెహెల్కా న్యూస్ : ప్రసిద్ద పుణ్యక్షేత్రం మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి మఠంకు భక్తుల కానుకల ద్వారా సమర్పించిన ఏప్రిల్ నెల 22 రోజుల హుండీ ఆదాయంను గురురాజంఘన భవన్ లో లెక్కించారు. కానుకల ద్వారా 3కోట్ల 25 లక్షల 96వేల 854 రూపాయల నగదు వచ్చినట్లు ఆదోని డివిజన్ దేవాదాయ ధర్మాదాయ శాఖ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వర్లు తెలిపారు.
భక్తులు సమర్పించిన కానుకల ద్వారా వచ్చిన నగదును శ్రీరాఘవేంద్ర స్వామి మఠం యొక్క అభివృద్ధి పనులకు, భక్తుల సౌకార్యాల కోసం ఉపయోగిస్తామని శ్రీ మఠం ఏ. ఏ. ఓ. మాధవ శెట్టి, మేనేజర్లు ఎస్. కె. శ్రీనివాస్ రావు వెంకటేష్ జోషి, శ్రీపతి ఆచార్,సురేష్ కోనాపూర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో మఠం అధికారులు సూపరిండెంట్ పురానిక్, జెపి స్వామి,తదితరులు పాల్గొన్నారు .

